telugu navyamedia
రాజకీయ వార్తలు

అద్దె బకాయిలను చెల్లించిన ప్రియాంకా గాంధీ

Priyanka

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తన నివాసానికి కట్టాల్సిన అద్దె బకాయిలను ఆన్ లైన్ పేమెంట్ విధానంలో చెల్లించారు. ఆమె ఉంటున్న 35, లోధీ ఎస్టేట్ ను ఖాళీ చేయాలని నిన్న కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆమెకు కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను కూడా తొలగించారు. ఈ నోటీసులు అందుకున్న గంటల వ్యవధిలోనే ప్రియాంకా గాంధీ తన బకాయిలను చెల్లించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

జూన్ 30 నాటికి ఆమె ఒక్క పైసా కూడా బకాయి లేరని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆమె మొత్తం రూ. 3,46,677 చెల్లించారని వెల్లడించారు. ప్రియాంకా గాంధీ బకాయిలను చెల్లించినప్పటికీ, ఆమె నెల రోజుల వ్యవధిలో ఇంటిని ఖాళీ చేయాల్సిందేనని, ఆగస్టు 1 తరువాత ఆమె అదే ఇంట్లో ఉంటే, నిబంధనల ప్రకారం చర్యలుంటాయని వెల్లడించారు.

Related posts