గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్సింగర్ నిక్ జొనాస్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగి.. హాలీవుడ్లోనూ క్వాంటికో సిరీస్లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. ప్రియాంక చోప్రా దాదాపు మూడేళ్ళ తర్వాత హిందీలో “ది స్కై ఈజ్ పింక్” అనే చిత్రంలో నటించింది. అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ కథానాయకుడిగా నటించారు. ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రాలు 2005లో “దిల్ దఢ్ఖనే దో” అనే చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాగా, “ది స్కైజ్ ఈజ్ పింక్” వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రం. ఇందులో ప్రియాంక 21 ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న “ది స్కై ఈజ్ పింక్” చిత్రంలో జైరా వసీమ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ప్రియాంక తల్లిగా జరీనా నటిస్తుంది. కాగా… నటిగా, గాయనిగా, నిర్మాతగా సినీ రంగంలో పలు పాత్రలు పోషించిన ప్రియాంకకు దర్శకత్వం కూడా చేయాలని ఆశగా ఉందట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక ఆ విషయాన్ని వెల్లడించింది. “దర్శకత్వం అనేది చాలా పెద్ద బాధ్యత. అందుకే మెగాఫోన్ పట్టుకోవాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. అయితే నటనపైనే పూర్తి దృష్టి కేంద్రికరించిన నేను నిర్మాతగా కూడా మారాను. కాలం అనుకూలిస్తే భవిష్యత్తులో డైరెక్టర్గా కూడా మారతానేమో” అని ప్రియాంక చెప్పింది.
previous post
బిగ్ బాస్, శ్రీముఖిలపై హిమజ సంచలన వ్యాఖ్యలు