గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్సింగర్ నిక్ జొనాస్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగి.. హాలీవుడ్లోనూ క్వాంటికో సిరీస్లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. ప్రియాంక చోప్రా దాదాపు మూడేళ్ళ తర్వాత హిందీలో “ది స్కై ఈజ్ పింక్” అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ కథానాయకుడిగా నటించారు. ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రాలు 2005లో “దిల్ దఢ్ఖనే దో” అనే చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాగా, “ది స్కైజ్ ఈజ్ పింక్” వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రం. ఇందులో ప్రియాంక 21 ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న “ది స్కై ఈజ్ పింక్” చిత్రంలో జైరా వసీమ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ప్రియాంక తల్లిగా జరీనా నటిస్తుంది. అక్టోబర్ 11, 2019న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇ15 ఏళ్లకే వక్తగా, రచయిత్రిగా గుర్తింపు సంపాదించుకున్న అయిషా చౌదరి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు చాలా మంచి స్పందన వచ్చింది. అక్టోబర్ 11న సినిమా విడుదలవుతుంది. శుకవ్రారం ఈ సినిమా ప్రీమియర్ షోను టోరంటో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్కి చిత్ర యూనిట్ అంతా వచ్చారు. షో అనంతరం భావోద్వేగానికి గురైన ప్రియాంక చోప్రా, డైరెక్టర్ సోనాలి బోస్ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.
previous post