కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శివసేనలో చేరారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సమక్షంలో ప్రియాంక పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూకాంగ్రెస్లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సొంత పార్టీపైనే ఫైర్ అయిన ప్రియాంక కాంగ్రెస్ పార్టీని వీడారు.
ఈ మేరకు కొంతమంది నేతలు తమ అనుచిత ప్రవర్తనతో బాధించారంటూ ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు. రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం కోసం వేచి చూడకుండానే.. వెంటనే శివసైనలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు తన ట్విటర్ ప్రొఫైల్లో తక్షణమే కాంగ్రెస్ పార్టీ హోదాలను సైతం ఆమె తొలగించారు..