కోలీవుడ్ లో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా… అందులో జయలలితకు సంబంధించిన ఒక బయోపిక్ లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. “తలైవీ” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో సినీ పరిశ్రమకి రాకముందు, సినీ పరిశ్రమలో మంచి నటిగా రాణిస్తున్న సమయంలో, రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలా నాలుగు గెటప్స్లో కంగనా సందడి చేయనుందట. ఈ చిత్రం కోసం కంగనా రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో అరవిందస్వామి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్ ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో లెజెండ్రీ పొలిటీషియన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి కంగనా లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ లుక్ కు ప్రేక్షకుల నుంచి విభిన్నమైన టాక్ వచ్చింది. అయితే జయలలిత జీవితంలో ముఖ్య వ్యక్తి శశికళ. ఆమె పాత్ర కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణిని ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తలైవీ చిత్రానికి హలీవుడ్కు చెందిన ప్రముఖ మేకప్మెన్ జోసన్ కాలిన్స్ పని చేస్తున్నట్టు తెలుస్తుంది.
previous post