telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా పరీక్షల ధరలను తగ్గించిన ఏపీ సర్కార్..

ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. కరోనా నిర్ధారణ పరీక్షల రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రైవేటు ల్యాబరేటరీల్లో కోవిడ్ 19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్ఏబీఎల్, ఐసీఎంఆర్ లు అనుమతించిన ప్రైవేట్ ల్యాబరేటరీల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎన్ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు మార్కెట్ లో పూర్తిగా అందుబాటులోకి రావటంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. ప్రభుత్వం పంపించే నమూనాలకు రూ. 800 మాత్రమే వసూలు చేయాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా తీసుకువచ్చే నమూనాలకు రూ. 1000 వరకూ వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. కాగా.. ఏపీలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 1732 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 47 వేల 977 కి చేరింది. ఇందులో 20,915 కేసులు యాక్టివ్ గా ఉంటే… 8,20,234 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6828 కి చేరింది.

Related posts