ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ద్రౌపది ముర్ము ఇప్పటివరకు 540 ఓట్లు సాధించారు. వీటి విలువ 3,78,000. మరోవైపు యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 1,45,600. మరో 15 ఓట్లు చెల్లలేదు.
ప్రస్తుతం రాష్ట్రాల నుంచి వచ్చిన ఓట్లు కౌంట్ చేస్తున్నారు.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాభారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తదుపరి నేత ఎవరో కొద్దిగంటల్లో తేలనుంది.