విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత బాలీవుడ్ గాయని కనికా కపూర్ కు కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. అయితే, ఆమె యూకే నుంచి తిరిగొచ్చిన తర్వాత లక్నోలో ఇచ్చిన విందుకు బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ హాజరయ్యారు. ఆమె నిర్లక్ష్యంపై లక్నో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కనికకు కరోనా ఉందన్న వార్తల నేపథ్యంలో తనకు కూడా ఈ వైరస్ సోకిందన్న అనుమానంతో ఆయన హోం క్యారంటైన్ అయ్యారు.
ఆ తర్వాత రాజస్థాన్, యూపీ ఎంపీలకు మార్చి 18న రాష్ట్రపతి విందుకు దుష్యంత్ హాజరయ్యారు. దీంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇవాళ రాష్ట్రపతికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అధికారిక కార్యక్రమాలను రాష్ట్రపతి రద్దు చేసుకున్నట్టు సమాచారం.