telugu navyamedia
రాజకీయ వార్తలు

మహిళల భద్రత అనేది చాలా ముఖ్యం: రాష్ట్రపతి రామ్ నాథ్

Ramnath president

మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. రాజస్థాన్ లో నిర్వహించిన మహిళా సామాజిక సాధికారత సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదని అన్నారు. అత్యాచార కేసుల్లో దోషులకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉండొద్దని అన్నారు.

పోక్సో చట్టం కింద అత్యాచార నిందితులుగా నిర్ధారించబడిన వారికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని, క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంట్ పున:సమీక్షించాలని సూచించారు. ఇదిలా ఉండగా, నిర్భయ నిందితుడి క్షమాభిక్ష పిటిషన్ ఫైల్ ను రాష్ట్రపతికి కేంద్ర హోం శాఖ పంపింది.

Related posts