telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రపతి .. ఏపీ పర్యటన.. అమ్మ దర్శనం..

president kovind in ap tour for 2 days

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఆ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాసేపట్లో రాష్ట్రపతి శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.

అనంతరం తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్నారు. రేపు ఉదయం 5.40 గంటలకు వరాహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఉదయం 6 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల నుంచి రాష్ట్రపతి పయనమై శ్రీహరికోటకు చేరుకోనున్నారు. శ్రీహరికోటలో చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వీక్షించనున్నారు.

Related posts