మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో “డిస్కో రాజా” అనే చిత్రంలో నటిస్తున్నాడు. “డిస్కో రాజా” చిత్రాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. నభా నటేశ్, పాయల్ రాజ్పుత్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేపథ్యంలో సాగనున్ననేపథ్యంలో తమిళ స్టార్ బాబీ సింహాని ప్రతి నాయకుడిగా ఎంపిక చేశారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2019న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కాగా… రవితేజ , టాలెంటెడ్ డైరెక్టర్ గోపించంద్ కాంబినేషన్లో వచ్చిన బలుపు, డాన్ శీను చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో సారి వీరిద్దరు కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనుండగా, దీనికి సంబంధించి కొన్నాళ్ళుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో గోపిచంద్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… “నా సినిమాకి సంబంధించి వెబ్ సైట్స్లో వస్తున్న వార్తలు అవాస్తవం. రవితేజ సినిమాకి సంబంధించి జోరుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రానికి సంబంధించిన పూర్తి డీటైల్స్ త్వరలోనే అందిస్తాను” అని పేర్కొన్నారు గోపిచంద్.
previous post