telugu navyamedia
సినిమా వార్తలు

అడివి శేష్ “ఎవరు” ప్రీ లుక్

Evaru-Pre-Look

“క్ష‌ణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడవి శేష్. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కు ప్ర‌శంస‌ల‌ను అందుకుని మంచి హిట్ సినిమాగా నిలిచింది “క్షణం”. ఇప్పుడు మ‌రోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేష‌న్‌లో ఓ థ్రిల్ల‌ర్ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రానికి “ఎవ‌రు” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను ఈద్ సందర్భంగా విడుద‌ల చేశారు. వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. క్ష‌ణం, గూఢ‌చారి సినిమాలతో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను సాధించిన అడివిశేష్ హీరోగా న‌టిస్తుండ‌గా, రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 23న విడుద‌ల చేయనున్నారు. తాజాగా ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో అడివి శేష్ విక్ర‌మ్ వ‌సుదేవ్ బ్యాడ్జ్‌తో కనిపిస్తున్నాడు. ఫ‌స్ట్ లుక్‌ని జూలై 11న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు.

ఈ హీరో త్వ‌ర‌లో మేజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. మేజర్ చిత్రానికి గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

Related posts