telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఫిక్స్…

Prashanth-neel

పాన్‌ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా జాతీయ స్థాయి దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా సలార్. అయితే కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ మంచి గుర్తింపు పొందాడు. యష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పొందిన విజయం అంతా ఇంతా కాదు. ఒక్క సినిమాతో జాతీయ స్థాయి దర్శకుడిగా ప్రశాంత్ పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత కేజీఎఫ్2ను తెరకెక్కించాడు. ఈ క్రమంలో ప్రశాంత్ తన తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌తో చేయడానికి సిద్దం అవుతున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌తో సలార్ అయిపోయిన వెంటనే ప్రశాంత్, ఎన్‌టీఆర్ కాంబో రాబోతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన కథ కూడా రెడీ అయిందని, దీనికి ఎన్‌టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. టాప్ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రశాంత్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్‌టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. దాని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీటి తరువాతే ప్రశాంత్, ఎన్‌టీఆర్ కాంబోపై క్లారిటీ వస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts