బాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక బయోపిక్ “పీఎం నరేంద్రమోదీ”. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత నేపథ్యంలో దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. అహ్మదాబాద్లో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్, గుజరాత్లోని పలు ప్రాంతాలలోను చిత్రీకరణ జరుపుకోనుంది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా పాత్రలో మనోజ్ జోషి, మోదీ తల్లి హీరాబెన్ పాత్రలో ప్రముఖ సీనియర్ నటి జరీనా వాహబ్, ఇక భార్య జశోదాబెన్ పాత్రని బర్ఖా బిస్త్ సేన్గుప్తా నటిస్తున్నారు. ఇటీవలే ఆయా పాత్రల లుక్స్ కూడా విడుదల అయ్యాయి. తాజాగా ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మర్డర్ 2 ఫేం ప్రశాంత్ నారాయణన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ఆయన లుక్ చాలా వైవిధ్యంగా ఉంది.
ఇక బొమన్ ఇరానీ, దర్శన్ కుమార్ ఇప్పటికే చిత్ర యూనిట్తో కలవగా తాజాగా చిత్రంలో పాల్గొనబోయే భారీ తారాగణాన్ని ప్రకటించారు. జరీనా వహబ్, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, బర్క బిష్ట్ సేన్గుప్తా, అక్షత్ ఆర్ సలుజా, అంజన్ శ్రీవాత్సవ్, రాజేంద్ర గుప్తా, యతిన్ కరేయ్ కర్ ముఖ్య పాత్రలు పోషించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నరేంద్రమోదీ తన రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రిగా తన హవా కొనసాగిస్తూ ప్రధాన మంత్రి ఎలా అయ్యాడో బయోపిక్లో చూపించనున్నట్టు నిర్మాతలు తెలిపారు. 23 భాషలలో చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, చిత్రాన్ని కూడా భారీగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. సుషేర్ ఓబెరాయ్, సందీప్ సింగ్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
జాక్స్ ను హర్ట్ చేసిన పూరీ… ఇకలేడు