telugu navyamedia
రాజకీయ వార్తలు

జేడీయూ నుంచి ప్రశాంత్ కిశోర్ సస్పెండు

prashanth kishofre

ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ (పీకే)కు జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) షాకిచ్చింది. జేడీయూలో నితీశ్ కుమార్ తర్వాత రెండో స్థానంలో ఉన్న ప్రశాంత్ కిశోర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత నితీశ్ కుమార్ ను ఉద్దేశించి బహిరంగంగా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన పై చర్యలు తీసుకుంది.

క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించారంటూ ఏకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టింది. పీకే వైసీపీ సహా పలు పార్టీల కోసం పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ కోసం ఆయన పని చేస్తున్నారు.

Related posts