తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రణబ్ ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ ఏర్పాటులో ఎందరో వీరుల త్యాగాలతో పాటు పులువురు జాతీయ నాయకుల కృషి ఉందన్నారు. వారిలో ఓ ముఖ్యమైన పేరు ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు. కేంద్ర మంత్రి హోదాలో, నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుపై నియమించిన కమిటీకి నాయకత్వం వహించిన ఆయన, ఆ తరువాత, రాష్ట్రపతి హోదాలో తెలంగాణ బిల్లుపై సంతకం కూడా పెట్టారు.
వైఎస్ మరణం, ఆపై తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైన తరువాత ఏపీని విడగొట్టాలని నిర్ణయం తీసుకున్న యూపీఏ, చివరకు లోక్ సభ ముందుకు బిల్లు తెచ్చింది. ఎన్నో వివాదాల అనంతరం, పార్లమెంట్ ఉభయ సభలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ఆమోదించింది. ఆ తరువాత అత్యంత కీలకమైన రాష్ట్రపతి సంతకాన్ని ప్రణబ్ ముఖర్జీ చేసిన సంగతి తెలిసిందే.
విభజన చట్టంలోని హామీలకు బడ్జెట్లో ప్రతిపాదనలు లేవు: ఎంపీ ప్రభాకర్ రెడ్డి