telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు గల్లంతు

ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఒకరు గల్లంతైన విషాద ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో చోటుచేసుకుంది. సముద్రం స్నానం చేసేందుకని నలుగురు ఇంటర్ విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అయితే, సముద్ర కెరటాల తాకిడికి యువకుడు జస్వంత్ గల్లంతయ్యాడు. మరో యువకుడు సూర్య సంజయ్ ని స్థానికులు ఒడ్డుకు చేర్చి, చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ నలుగురు విద్యార్థులు గుంటూరులోని మాస్టర్ మైండ్స్ కళాశాలలో చదువుకున్నట్టు తెలుస్తోంది.

Related posts