telugu navyamedia
రాజకీయ వార్తలు

కేఏ పాల్ కు నాన్ బెయిలబుల్ వారెంట్!

KA Paul comments Chandrababu

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి మిగతా నిందితులు కోర్టులో హాజరైనప్పటికి పాల్ మాత్రం హాజరు కాలేదు. దీంతో, పాల్ కు మహబూబ్ నగర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు సమాచారం.

2010 ఫిబ్రవరిలో కేఏ పాల్ సోదరుడు డేవిడ్ రాజు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న కారులో డేవిడ్ రాజు మృతదేహం లభ్యమైంది. హత్య కేసులో తొమ్మిదో నిందితుడిగా పాల్ ఉన్నారు. పాల్ కు, డేవిడ్ రాజు కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాల్సిందిగా పాల్ కు పలుమార్లు కోర్టు నోటీసులు పంపారు. అయినప్పటికీ పాల్ స్పందించకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.

Related posts