“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ దేశవ్యాప్తంగా మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రిలీజ్ కావడానికి ముందే ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, అంచానలను మరింత పెంచేసింది. మరోవైపు పారిస్ లోని ప్రతిష్ఠాత్మక థియేటర్ ‘లి గ్రాండ్ రెక్స్’లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ థియేటర్ యూరప్ లోనే అతి పెద్దది. ఈ థియేటర్ లో ఒకేసారి 2800 మంది సినిమాను వీక్షించవచ్చు. ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన ‘కబాలి’, విజయ్ నటించిన ‘మెర్సెల్’, ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ దక్షిణాది చిత్రాలు మాత్రమే ఈ థియేటర్ లో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు ‘సాహో’ కూడా ఆ థియేటర్ లో ప్రదర్శించనుండటంతో… ఆ థియేటర్ లో రెండు సినిమాలను విడుదల చేసిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించారు.
previous post