ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా “సాహో” బాగానే కలెక్షన్స్ను రాబడుతోంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అభిమానులని కూడా పెద్దగా అలరించలేకపోయిందనే టాక్ నడుస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేర సినిమాకు తొలిరోజు రూ.104.8 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలంగాణలో రూ.14.1కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.42.2కోట్లు, కర్ణాటకలో రూ.13.9కోట్లు, తమిళనాడు రూ.3.8కోట్లు, కేరళ రూ.1.2కోట్లు, హిందీ 29.6కోట్ల గ్రాస్ వసూళ్లను సినిమా సాధించింది. షేర్ కలెక్షన్స్ ప్రకారం చూస్తే సినిమాకు రూ.68.1కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వారాంతంలో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
previous post
పరుచూరి గోపాలకృష్ణ భార్యను చంపాలనుకున్నా : పోసాని