‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. ఇక నుంచి ఆయన చేసే సినిమాలే కాదు ఆయన తీసుకునే పారితోషికం కూడా అంతే రేంజ్లో ఉంటుంది. ఇటీవల ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రభాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.వైజయంతి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని, ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరవేసేలా సినిమాను తీస్తానని అశ్విన్ తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం సినిమాకు ప్రభాస్ ఏకంగా 70 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకున్నారట. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్న విషయంలో ప్రభాస్కు సంబంధం లేదు. సినిమా అవుట్పుట్ ఎలా ఉన్నా ప్రభాస్కు రావాల్సిన 70 కోట్లు ఇవ్వాల్సిందేనట.మరో పది నెలల తర్వాత సినిమా షూటింగ్ మొదలవుతుందని అశ్విన్ తెలిపారు. సినిమాను తెలుగు, హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు కాబట్టి బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణెను హీరోయిన్గా ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట.
previous post