telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేవలం గ్రాఫిక్స్ కే 50 కోట్లు…!!

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సైతం పాన్‌ ఇండియా చిత్రంగానే ముస్తాబవుతోంది. అయితే ఇప్పుడు డార్లింగ్‌కి ఉన్న ఈ పాన్‌ ఇండియా ఇమేజ్‌ను పాన్‌ యూనివర్సల్‌ ఇమేజ్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50 వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో ఓ సినిమా నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా ఇది. ఓ విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముందని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ సినిమా విఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే దాదాపు రూ.50 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం.

Related posts