ఏ రంగంలో అయినా పోటీ ఎక్కువగా ఉన్నమాట నిజమే. ఒకపక్క పోటీ తత్వానికి తగ్గట్టుగా కెరీర్ మలచుకుంటూ, మరో పక్క ప్రతికూల పరిస్థితులకు తగ్గట్టుగా అడుగులు వేస్తూ, కెరీర్ బ్యాలన్స్ చేసుకుంటున్నారు. అదే స్టార్ హీరోస్, హీరోయిన్స్ సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యాపార రంగంలోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నాగార్జున ,చిరు ప్రముఖ ఛానెల్లో భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కూడా ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తుంది.
ప్రభాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్లు త్వరలో ఓ టీవీ ఛానెల్ ప్రారంభించనుండగా,అందులో ప్రభాస్ కూడా భాగస్వామి కానున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఏదేమైన మన స్టార్స్ ఓ వైపు నటనని కొనసాగిస్తూనే మరోవైపు బిజినెస్ రంగాలపై దృష్టి పెట్టడం విశేషం.
ఇటీవలి కాలంలో మహేష్ బాబు ఏఎమ్బీ అనే మల్టీ ప్లెక్స్తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే. బన్నీ కూడా త్వరలోనే ఓ మల్టీప్లెక్స్ నిర్మించనున్నాడని అన్నారు. కాగా , ప్రస్తుతం ప్రబాస్ ‘సాహో’ చిత్రంతో పాటు రాధాకృష్ణ సినిమాలతో బిజీగా ఉన్నాడు , సాహో చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.