యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఇక బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తన బాహుబలి సినిమాతో ఉత్తరాదిలో కూడా ప్రభాస్ ఓ పెద్ద స్టార్ అయిపోయాడు. తాజాగా “సాహో”తో మరోసారి బాలీవుడ్లో తెలుగువారి సత్తా చూపేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ప్రభాస్ డైరెక్ట్గా ఓ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్లో ప్రభాస్ను డైరెక్ట్ చేయబోయేది ఎవరో కాదు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్. ఓ మీడియా ఛానల్లకు ఇంటర్య్వూ ఇచ్చిన సందర్భంగా ప్రభాస్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బాహుబలి రిలీజ్ సమయంలో కరణ్ జోహార్ మాకు అండగా నిలిచారు. దేశంలోనే ‘అతిపెద్ద సినిమా’గా పేరు పెట్టింది కూడా కరణ్ జోహారే. ఇప్పుడు సాహోని కూడా అతడే బాలీవుడ్లో సమర్పిస్తున్నాడు. “మేం పరస్పరం తెలుసు. కచ్చితంగా ఓ మంచి సినిమా చేస్తాం” అని ప్రభాస్ అన్నాడు. బాహుబలి సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ప్రభాస్తో సినిమా గురించి కరణ్ జోహార్ చర్చించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, కరణ్ జోహార్ ఆఫర్ను ప్రభాస్ తిరస్కరించాడని ఓసారి, రెమ్యునరేషన్గా రూ.30 కోట్లు డిమాండ్ చేశాడనని మరోసారి ప్రచారం జరిగింది.
ఇక రీమిక్స్ సాంగ్స్ కు దూరం… బాలూ గారు తిడుతున్నారు : తమన్