యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతుండడంతో అన్ని ప్రాంతాల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.
పంచ వ్యాప్తంగా ఇప్పుడు సాహో మేనియా నడుస్తుంది.10 వేల స్క్రీన్స్ లో “సాహో” విడుదలవుతుంది. మరికొన్ని గంటల్లో వినేమ విడుదలవుతుండటంతో థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి కూడా మొదలైంది. ఇప్పటికే అన్నీ స్క్రీన్స్ దగ్గర బ్యానర్స్, కటౌట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు అనుకోని విషాదం చోటు చేసుకుంది. మహబూబ్నగర్ తిరుమల థియేటర్ ఆవరణలో ప్రభాస్ సాహో బ్యానర్ కడుతూ ఓ అభిమాని కన్నుమూసాడు. బ్యానర్ కడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దాంతో ఒక్కసారిగా అంతా షాక్ అయిపోయారు. ఊహించని ఈ ఘటనతో థియేటర్ యాజమాన్యం కూడా షాక్ లోకి వెళ్లిపోయింది.
చెన్నై నగరం నీరు లేని నగరంగా మారింది… హాలీవుడ్ హీరో కామెంట్స్