telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ ను మించిపోయిన ప్రభాస్

Prabhas

హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించిన ఏఎంబీ మాల్… అత్యంత విలాసమైన ఈ థియేటర్ లో సినిమాలు చూసిన ప్రేక్షకులు, ఆ అనుభూతి అద్భుతం అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ తరహా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణం చేసే ఆలోచనలో చాలామంది సినిమా ప్రముఖులు ఉన్నారు. తాజాగా ప్రభాస్ కూడా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణంపైనే సృష్టి సారించి ఆ దిశగా పనులను వేగవంతం చేశాడట. ఆంధ్రప్రదేశ్‌, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్ రూపొందనుంది. చెన్నై- కోల్‌కతా రహదారిపై సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిండిపాళెం వద్ద దేశంలోనే అతిపెద్ద భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. ఒక్కో థియేటర్లో 170 సిట్టింగ్ సామర్థ్యంతో, మొత్తం 670 సీట్ల సిట్టింగ్ కలిగిన స్క్రీన్లతో ఈ మాల్ ఉంటుందని అంటున్నారు. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో, 106 అడుగుల వెడల్పు తెరతో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మితమవుతోందట. ఆసియాలో ఇంతపెద్ద తెర కలిగిన మల్టీ ప్లెక్స్ లలో ఇది రెండవదట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts