తెలుగు అగ్రహీరోలు ముగ్గురూ ఒకే ఫ్రేములో కనిపిస్తే… అలాంటి అద్భుతమైన ఘట్టానికి వేదికగా మారింది ముంబై. అక్కడే తెలుగు సినిమా స్థాయిని మార్చేస్తున్న హీరో ప్రభాస్ “సాహో” సినిమా ప్రమోషన్లలో అక్కడే ఉండగా, “సైరా” టీజర్ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఈరోజు అక్కడికి వెళ్లారు. ఆగస్ట్ 30న ఈ చిత్రం విడుదల కానుంది. సైరా ఈవెంట్ అయిపోయిన వెంటనే బయటికి వచ్చి ప్రభాస్ను కలిసాడు మెగాస్టార్. ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్ ముగ్గురూ కూడా ఓకే ఫ్రేమ్లో ఉన్నారు. “సాహో, సైరా, అల్లూరి” అంటూ సోషల్ మీడియాలో ఈ ముగ్గురూ కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మెడలో వైరల్ అవుతున్నాయి. ఈ ముగ్గుర్ని ఒకే ఫ్రేమ్లో చూసి అభిమానులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో సైరా టీజర్, సాహో ట్రైలర్ రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
previous post