ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న వార్త ఇప్పుడు నిజమైంది. అయితే కేజియఫ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ప్రముఖ స్టార్ల దృష్టి దర్శకుడు ప్రశాంత్నీల్పై పడింది. ప్రశాంత్నీల్ చేయబోయే ప్రాజెక్టులో కలిసి వర్క్ చేయాలని టాలీవుడ్ స్టార్లు తహతహలాడుతున్నారు. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ను కలిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వారిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రానుందని అభిమానులు పక్కాగా డిసైడ్ అయ్యారు.ఈ మేరకు కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ట్విట్టర్లో కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్నీల్ తో ప్రభాస్ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసింది. ‘ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్’ అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ “సాలార్” టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ లుక్ అలరిస్తుంది.ఇప్పటికే ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్ర షూటింగ్లో ఉన్నా.. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమాలో నటించనున్నారు. నాగ్ఆశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది అనేది.
previous post
next post
రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు: మాయావతి