telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అసెంబ్లీ సమావేశాల అనంతరం “ప్రజా దర్బార్”

minister kannababu

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ సర్కార్ జూలై 1 నుంచి నిర్వహించే ” ప్రజా దర్బార్” వాయిదా పడింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో మంత్రి కన్నబాబు స్పందించారు. ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం భేటీ జరిగింది.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆగస్టు 1 నుంచి “ప్రజాదర్బార్” ప్రారంభించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కాగా ప్రజా దర్బార్ కు సంబంధించిన కార్యాలయం, ఇందుకు సంబంధించిన పనులు పూర్తి కాలేదని సమాచారం. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్నినిర్వహిస్తామని
ఏపీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts