telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

కేటీఆర్ ను అవినీతిపరుడు అనడం నచ్చలేదు: పోసాని

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో రూ.50 లక్షలు లంచం ఇస్తూ దొరికిపోయిన వ్యక్తి అని, ఇలా పట్టుబడిన రాజకీయ నాయకుడ్ని తాను మరెవ్వరినీ చూడలేదని పోసాని పేర్కొన్నారు. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ ను అవినీతిపరుడు అనడం తనకు నచ్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజలకు మంచి రాజకీయ నాయకుల అవసరం ఉందని, ఉన్న ఒకరిద్దరు మంచి నాయకులపై బురద చల్లే ప్రయత్నాలు చేయడం బాధాకరమని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఇద్దరు యువ నేతలు నీతికి ప్రతిరూపాలని, వారిలో ఒకరు కేటీఆర్, మరొకరు హరీశ్ రావు అని వెల్లడించారు. నూటికి నూరు శాతం వీళ్లు నిజాయతీపరులుని కుండబద్దులు కొట్టినట్టు చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణకు వీరిద్దరే రెండు కళ్లవంటివారని పోసాని అభివర్ణించారు.

Related posts