బాలయ్య డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ ఎంతో నిజాయతీ ఉన్న వ్యక్తి అని, తండ్రి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన పలుకుబడిని ఉపయోగించుకోలేదని వెల్లడించారు. బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమేనని, ఆయన మాటలను సీరియస్ గా పట్టించుకుని ఎవరూ బాధపడొద్దని హితవు పలికారు.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండలేదని బాలయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ కలలు కంటున్నాడని చెప్పారు. ఇప్పుడు ఏపీ సీఎం ఎన్టీఆర్ కాదని… జగన్ అని స్పష్టం చేశారు. జగన్ ఒకరికి వెన్నుపోటు పొడవడని అన్నారు. కాబట్టి ఐదేళ్లపాటే కాదు, పదేళ్లు సీఎంగా జగనే ఉంటాడని అన్నారు.