telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పేద ముస్లింల అంత్యక్రియలకు రూ.5 వేల సాయం: వక్ఫ్‌ బోర్డు

waqf board telangana

పేద ముస్లింల అంత్యక్రియలకు సాయం అందించాలని తెలంగాణ వక్ఫ్‌ బోర్డు నిర్ణయించింది. పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల సాయం అందించాలని బోర్డు నిర్ణయించింది. చైర్మన్‌ మహమ్మద్‌ సలీం అధ్యక్షతన శనివారం బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో మొత్తం 49 అంశాలపై చర్చించింది.

గంధంగూడ గ్రామంలో శ్మశానవాటిక సర్వేనంబర్‌ 81లో ఓ ముస్లిం మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్‌ కేసు నమోదుచేయాలని కలెక్టర్‌ను కోరింది. శ్మశానవాటికల్లో మృతదేహాల ఖననంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొంది.

Related posts