పేద ముస్లింల అంత్యక్రియలకు సాయం అందించాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల సాయం అందించాలని బోర్డు నిర్ణయించింది. చైర్మన్ మహమ్మద్ సలీం అధ్యక్షతన శనివారం బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో మొత్తం 49 అంశాలపై చర్చించింది.
గంధంగూడ గ్రామంలో శ్మశానవాటిక సర్వేనంబర్ 81లో ఓ ముస్లిం మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదుచేయాలని కలెక్టర్ను కోరింది. శ్మశానవాటికల్లో మృతదేహాల ఖననంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొంది.