బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హా సమాజ్వాదీ పార్టీలో చేరారు. అయితే పూనమ్ కూడా 1968లో ఆమె మిస్ యంగ్ ఇండియా అవార్డు అందుకున్నారు. అంతేకాదు నటిగా రాణించారు. శతృఘ్న, పూనమ్ల వివాహం జరిగి 38 ఏళ్లు అవుతోంది. ఇటీవల కపిల్ శర్మ టీవీ షోకు హాజరైన పూనమ్ తన జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తాము తొలిసారి పాట్నా, ముంబై రైలు ప్రయాణంలో కలుసుకున్నామని, అప్పుడు శతృఘ్న తనతో మాట్లాడేందుకు ప్రయత్నించారని, ట్రైన్ ఒక గుహ గుండా వెళుతుండగా తన పాదాలు తాకారని, ఆ తరువాత ఏమీ మాట్లాడలేదని తెలిపారు. 1980 జూలై 9 శతృఘ్న, పూనమ్ల వివాహం జరిగింది. అయితే అప్పటికే శతృఘ్న, హీరోయిన్ రీనారాయ్ల అఫైర్స్ గురించిన వార్తలు వినిపిస్తున్నాయి.
రీనా, శతృఘ్నల అనుబంధం ఏడేళ్లు గడిచిందని అంటుంటారని, ఈ విషయం తనకు కూడా తెలుసని పూనమ్ పేర్కొన్నారు. ఇదే విషయమై శతృఘ్న కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీనాతో తన అఫైర్ పర్సనల్ అని, సాధారణంగా పెళ్లియితే మారిపోతారంటారని, కానీ అప్పుడే తనకు రీనా మీద అభిమానం మరింత పెరిగిందన్నారు. ఆమె నాతో ఏడేళ్లు జీవితాన్ని పంచుకోవడం తన అదృష్టమన్నారు. దీని గురించి పూనమ్ మాట్లాడుతూ తనకు భర్త అఫైర్ గురించి తెలుసని, దీంతో తాను వారి మార్గానికి అడ్డురాలేదని తెలిపారు. పెళ్లయిన తరువాత కూడా వారి అఫైర్ కొనసాగిందని చెప్పారు.
ఇకపై అది అధికారికంగా నీ సమస్య… అల్లుడిపై నాగబాబు షాకింగ్ కామెంట్