హీరోయిన్ పూనమ్ కౌర్ కు టాలీవుడ్ లో లక్ కలిసి రాలేదు. 2018లో వచ్చిన ‘నెక్ట్స్ ఏంటి’ సినిమాలో కనిపించిన పూనమ్ ఆ తర్వాత తెలుగులో పూర్తిగా సినిమాలు చేయడం మానేశారు. దాంతో పూనమ్ తనకు ఇష్టం లేకే సినిమాలు చేయడం లేదా లేకపోతే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఇన్డైరెక్ట్గా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వల్ల అవకాశాలు తగ్గిపోయాయా అన్న అనుమానాలు ప్రేక్షకుల్లో కలిగాయి. అయితే ఇందుకు కారణమేంటో తాజాగా పూనమ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “నాకు అవకాశాలు వస్తున్నా కూడా నేనే సంతకం చేయడంలేదు. ఎందుకంటే నాకు ఇక పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లల్ని కనాలని ఉంది. నాకంటూ ఓ కుటుంబం ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది’ అని వెల్లడించారు. అదనమాట సంగతి. మరి పూనమ్ కోరిక మేరకు ఇంట్లో వారు సంబంధాలు చూస్తున్నారో. లేకపోతే పూనమ్ మనసులో ఎవరైనా ఉన్నారో ఆమే చెప్పాలి. మరో విషయం ఏంటంటే.. త్వరలో జరగబోతున్న ప్రతిష్ఠాత్మక కర్తార్పూర్ కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమం నిమిత్తం పూనమ్ పాకిస్థాన్ వెళ్లబోతోంది. ఈ వేడుకకు హాజరుకావాలని స్వయంగా పాకిస్థాన్ ప్రధాని పూనమ్ను ఆహ్వానించారట.
previous post
“ప్రధాని నరేంద్ర మోడీ మీదనే పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ “మా”.. లో .. ఇలా ..?” -శివాజీ