వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లతో పూజా హెగ్డే చాలా బిజీగానే ఉంది. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత నుండి వాల్మీకి వరకూ అన్నీ క్రేజీ సినిమాలే. ఇటీవల అల్లు అర్జున్ తో కలిసి ఈ బ్యూటీ నటించిన “అల వైకుంఠపురంలో” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా జాన్లో నటిస్తోంది. మరోవైపు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలలో నటిస్తుంది. అయితే ఈ అమ్మడు తాజాగా బాలీవుడ్లో బడా ఆఫర్ కొట్టేసింది. సల్మాన్ హీరోగా ఫర్హద్ సంజీ తెరకెక్కిస్తున్న “కబీ ఈద్ కబీ దీవాళీ” చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. సల్మాన్ సరసన నటించే ఆఫర్ పూజాకి దక్కడంతో ఎగిరి గంతేస్తుంది. సాజిద్ నడియావాలా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా కథ కూడా అందిస్తున్నాడు. 2021 ఈద్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రాధే అనే సినిమా చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న “రాధే” సినిమాలో దిశా పటాని, జాకీ శ్రోఫ్ఫ్, రందీప్ హూడా నటిస్తునంరు. ఈ ఏడాది ఈద్ కానుకగా సినిమా విడుదల కానుంది.