స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “దువ్వాడ జగన్నాథమ్” సినిమాతో గ్లామరస్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించింది హీరోయిన్ పూజా హెగ్డే. ఆ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించే అవకాశం పూజకు దక్కింది. ఎన్టీయార్తో ఇప్పటికే “అరవింద సమేత” సినిమా చేసిన పూజ, మహేష్తో “మహర్షి” చేసింది. అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ నటిస్తోంది. అయితే ఈ మూడు సినిమాల షూటింగ్లో ఒకే సమయంలో జరిగాయి. దీంతో ఒకేరోజు ఈ మూడు సినిమాల షూటింగ్ల్లోనూ పాల్గొనేదట. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆ అనుభవాన్ని పూజ వెల్లడించింది. “గతేడాది ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్ల్లో పాల్గొన్నాను. ఒక్కో రోజు మూడు షిఫ్ట్ల్లోనూ పనిచేసేదాన్ని. ఉదయం ఎన్టీయార్ సినిమా షూటింగ్లోనూ, మధ్యాహ్నం మహేష్ సినిమా షూటింగ్లోనూ, రాత్రికి ప్రభాస్ సినిమా షూటింగ్లోనూ పాల్గొనేదాన్ని. ఆ తర్వాత మూడు గంటలు మాత్రమే పడుకునేదాన్ని. అది నా కెరీర్లోనే బెస్ట్ ఎక్స్పీరియెన్స్. ఎక్కువ సేపు పడుకుంటేనే అందంగా ఉంటామని అంటుంటారు. కానీ, నేను తక్కవ సమయం పడుకుంటేనే అందంగా ఉంటాను” అంటూ పూజ చెప్పింది.
previous post
బాక్సర్ ఈవాండర్ హోలీఫీల్డ్కు శిక్షణ ఇచ్చింది కేఏ పాల్ : వర్మ