telugu navyamedia
సినిమా వార్తలు

ఒకేరోజు ముగ్గురు హీరోలతో… రాత్రీపగలూ తేడా లేకుండా…

Pooja-Hegde

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన “దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌” సినిమాతో గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది హీరోయిన్ పూజా హెగ్డే. ఆ సినిమా త‌ర్వాత ప‌లువురు స్టార్ హీరోల‌తో నటించే అవ‌కాశం పూజ‌కు ద‌క్కింది. ఎన్టీయార్‌తో ఇప్ప‌టికే “అర‌వింద స‌మేత‌” సినిమా చేసిన పూజ, మ‌హేష్‌తో “మ‌హ‌ర్షి” చేసింది. అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమాలోనూ న‌టిస్తోంది. అయితే ఈ మూడు సినిమాల షూటింగ్‌లో ఒకే స‌మ‌యంలో జ‌రిగాయి. దీంతో ఒకేరోజు ఈ మూడు సినిమాల షూటింగ్‌ల్లోనూ పాల్గొనేద‌ట‌. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆ అనుభ‌వాన్ని పూజ వెల్లడించింది. “గ‌తేడాది ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్నాను. ఒక్కో రోజు మూడు షిఫ్ట్‌ల్లోనూ ప‌నిచేసేదాన్ని. ఉద‌యం ఎన్టీయార్ సినిమా షూటింగ్‌లోనూ, మ‌ధ్యాహ్నం మ‌హేష్ సినిమా షూటింగ్‌లోనూ, రాత్రికి ప్ర‌భాస్ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనేదాన్ని. ఆ త‌ర్వాత మూడు గంట‌లు మాత్ర‌మే ప‌డుకునేదాన్ని. అది నా కెరీర్‌లోనే బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌. ఎక్కువ సేపు ప‌డుకుంటేనే అందంగా ఉంటామ‌ని అంటుంటారు. కానీ, నేను త‌క్క‌వ స‌మ‌యం ప‌డుకుంటేనే అందంగా ఉంటాను” అంటూ పూజ చెప్పింది.

Related posts