అఖిల్ అక్కినేని నాలుగో చిత్రం షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుందని ఇది వరకే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ చిత్ర యూనిట్తో పూజా హెగ్డే జాయిన్ అయ్యింది. ఆమె సెట్లో చేసిన సందడినంతా ఓ చిన్న వీడియో ప్రోమోగా చేసి నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం మహేశ్, ఎన్టీఆర్, రామ్చరణ్తో రంగస్థలంలో స్పెషల్ సాంగ్లో నటించిన పూజాహెగ్డే అఖిల్తో సినిమా చేస్తుంది. దీని తర్వాత ప్రభాస్ చిత్రంలో నటించనుంది పూజా హెగ్డే.
.@hegdepooja on her Day 1 shoot of #Akhil4 today!@AkhilAkkineni8 #BommarilluBhaskar #GopiSunder #PradeeshMVarma#BunnyVas #VasuVarma @GA2Official pic.twitter.com/sADWEhGPLr
— BARaju (@baraju_SuperHit) 20 September 2019
‘ఉప్పెన’ చిత్రంపై సేతుపతి కామెంట్స్ …