అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్లు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా ధైర్యంగా షూటింగ్ షురూ చేశారు. ఈ సినిమా చిత్రీకరణలో మంగళవారం పాల్గొన్నారు పూజా హెగ్డే. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘మళ్లీ సెట్లోకొచ్చాను’ అని తన టీమ్తో కలసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు.
previous post
next post
చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్…