telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేవుడికి శఠగోపం పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే…

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. సీఎం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు. దేవుడికి శఠగోపం పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కిందని… రాజన్న ఆలయం ను 400 కోట్లతో అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీ సీఎం మర్చిపోయారని మండిపడ్డారు. హామీ ఇచ్చి 6 సంవత్సరాలు గడుస్తుందని… స్మశాన వాటిక, మినీ స్టేడియం, డబుల్ బెడ్ రూమ్స్ నేటికి పూర్తి కాలేదని ఫైర్‌ అయ్యారు. ఎమ్యెల్యే వేములవాడ లో లేక సుమారు రెండు సం రాలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఇప్పటికయినా సీఎం కేసీఆర్ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండని డిమాండ్ చేశారు.

Related posts