telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఓటమి మాకు కొత్త కాదు..

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు టార్గెట్ 2023గా మరింత కష్టపడుదామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కూడా ప్రభావితం కావద్దని కార్యకర్తలు మరింత ఉత్సాహంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 2023 టార్గెట్ గా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. అదేవిధంగా బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుని ప్రజల దృష్టిని మళ్లించి ఎన్నికల సరళిని మార్చేశారని తెలిపారు. అయిన కూడ మన అభ్యర్థి గాని, నాయకులు గానీ, కార్యకర్తలు గాని కష్టపడి పని చేశారు. కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఎన్నికల లోపల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇష్టం లేదనే తీర్పు గానే పరిగణించాలి. ఇది బీజేపీ పార్టీ యొక్క గెలుపు కాదని… రఘునందన్ రావు మూడు సార్లు ఓడిపోయారని సానుభూతితో గెలుపొందారు ఇది రఘునందన్ రావు గెలుపు బిజెపి పార్టీ గెలుపు కాదని పేర్కొన్నారు. ఓటమి కాంగ్రెస్ కి కొత్త కాదు ఇంతకన్నా ఘోరమైన సందర్భాల్లో పడిపోయిన ప్రతీసారి చాలా సార్లు కాంగ్రెస్ బలంగా నిలబడిందని గుర్తు చేశారు.

Related posts