telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతుల అక్రమ అరెస్టులు పిరికిపంద చర్యలు..

ponnam prabhakar fire on ktr

తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎం.పీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మొక్కజొన్న రైతులు జగిత్యాలలో చేపట్టిన మహా ర్యాలీ ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. రైతుల అక్రమ అరెస్టులు పిరికిపంద చర్యలని..మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి న్యాయం.చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. రైతుల డిమాండ్ల సాధనకోసం మహా ర్యాలీ చేస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. కాగా..వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. యాసంగిలో పంటల సాగుపై చర్చిస్తారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకుంటారు. గత ఏడాది ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు? వాటికి ఎంత ధర వచ్చింది? తదితర వివరాలను సమావేశానికి తీసుకురావల్సిందిగా అధికారులను సీఎం కెసిఆర్ ఆదేశించారు. యాసంగిలో మక్కల సాగు చేయడం వల్ల లాభమా? నష్టమా? దేశంలో మక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం సీఎం కెసిఆర్ తీసుకుంటారు.

Related posts