telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇంటికి తీసుకెళ్లిన ఈవీఎం.. పోలింగ్‌ అధికారి సస్పెండ్

evm issues even in 4th schedule polling

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో దేశ వ్యాప్తంగా 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పోలింగ్‌ అధికారి ఈవీఎంను ఇంటికి తీసుకెళ్లారు. రిజర్వ్‌ ఈవీఎంను తన ఇంటికి తీసుకువెళ్లిన పోలింగ్‌ అధికారి ఏకే శ్రీవాస్తవను అధికారులు సస్పెండ్‌ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని గుణలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్‌ అధికారి, సెక్టార్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ శ్రీవాస్తవను సస్పెండ్‌ చేశామని, ఆయన నివాసం నుంచి ఈవీఎంను సీజ్‌ చేశామని ఎస్డీఎం శివాని రక్వార్‌ గార్గ్‌ వెల్లడించారు.గుణలో కాంగ్రెస్‌ దిగ్గజ నేత, సిటింగ్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాతో బీజేపీ అభ్యర్థి కేపీ యాదవ్‌ బరిలో ఉన్నారు.

Related posts