తెలంగాణలో ఈనెల 23న జరిగే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి వచ్చే కౌటింగ్ ఏజెంట్ల వివరాలను అందజేయాలని లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారంలో వివరాలను నమోదు చేసి సకాలంలో అందజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియ , పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 8గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అందువల్ల ఏజెంట్లుగా వచ్చే ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయం లో కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు.