telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీ జెండాల బూట్లతో పోలింగ్ కేంద్రానికి.. చితకబాదిన బీజేపీ కార్యకర్తలు!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో దేశ వ్యాప్తంగా 59 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌  ప్రశాంతంగా సాగుతోంది. బెంగాల్‌లో బీజేపీ-తృణమూల్‌ కార్యకర్తల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. జౌన్పూర్ జిల్లాలోని షాగంజ్ గ్రామంలో ఈరోజు పోలింగ్ సందర్భంగా ఓ వ్యక్తి బీజేపీ జెండాలను బూట్లలాగా కాళ్లకు చుట్టుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. దీంతో అతడిని చూసిన బీజేపీ కార్యకర్తలకు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే అతడిని పట్టుకుని చితకబాదారు. అయితే పోలింగ్ కేంద్రం పరిధిలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పోలింగ్‌కు కొంత అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.

Related posts