మరోసారి పోలీసులు టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసినా, ఆయన స్పందించక పోవడంతో నిన్న సాయంత్రం మరోసారి నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ లోని రవిప్రకాశ్ నివాసానికి వెళ్లిన పోలీసులకు, ఆయన కనిపించక పోవడంతో గోడకు నోటీసులు అంటించారు.
మంగళవారం నాడు సైబర్ క్రైప్ పీఎస్ లో విచారణకు రాకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీసీఎల్ కంపెనీ సెక్రెటరీ దేవేంద్ర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు టీవీ 9 చానెల్ యాజమాన్య సంస్థ అలంద మీడియా రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ల నియామకంలో అడ్డుపడటం, ఫోర్జరీ పత్రాల సృష్టించారని, నటుడు శివాజీతో కలిసి నకిలీ పత్రాలు తయారు చేశారని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ కేసులో నటుడు శివాజీ కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు.