telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్ తో సహా పలువురికి పార్శిల్స్.. ఏముందనే విషయమై ఆరా!

post office

తెలంగాణ సీఎం కేసీఆర్ తో సహా పలువురు వీఐపీలకు ఒక్కసారిగా వచ్చిన పార్శిళ్లు కలకలం రేపాయి. సికింద్రాబాద్ పోస్టాపీసు కార్యాలయానికి మంగళవారం వచ్చిన బాటిల్ పార్శిల్స్ పై పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. ముఖ్యమంత్రి , మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో ఈ బాటిల్స్ వచ్చాయి.విఐపీలకు బాటిల్స్ పార్శిల్ రావడంపై పోస్టల్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ బాటిల్స్‌లో ఏముందనే విషయమై తేల్చేందుకు ల్యాబ్ కు పంపారు.ఇంత పెద్ద ఎత్తున ఒకే సారి వీఐపీలకు పార్శిల్ రావడంపై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు.ఈ బాటిల్స్ ఎక్కడ నుండి వచ్చాయనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. బాటిల్స్ లో ఏమున్నాయనే విషయమై నిగ్గు తేల్చేందుకు ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురు చేస్తున్నారు.

Related posts