ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖాసిం నివాసంలో శనివారం ఉదయం పోలీసులు సోదాలు చేపట్టారు. ఖాసింకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. ఓయూ క్యాంపస్ ఆవరణలోని క్వార్టర్స్లో కాశీం నివాసం ఉంటున్నారు.
సోదాల్లో మావోయిస్టులకు సంబంధించిన పుస్తకాలు, కరపత్రాలు, సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ ఖాసిం నూతనంగా విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.