telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Accident

రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది. రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts