telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విచారణకు హాజరైన దర్శకుడు శంకర్!

sanker

ప్రముఖ దర్శకుడు శంకర్ ‘భారతీయుడు-2’ షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదంపై వివరణ ఇచ్చేందుకు నిన్న చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసులో ఆయనకు నోటీసులు అందాయన్న సంగతి తెలిసిందే. ఆయన్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ నాగజ్యోతి విచారించారు. ప్రమాదం ఎలా జరిగింది? ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా? సినిమాకు బీమా ఉందా? వంటి ప్రశ్నలను ఆమె అడిగినట్టు సమాచారం. ఇక కేసు విచారణలో భాగంగా నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్, క్రేన్ కాంట్రాక్టర్, ఆపరేటర్ తదితరులతో పాటు హీరో కమల్ హాసన్ పైనా కేసును రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కమల్ ను సైతం పోలీసులు ప్రశ్నించనున్నారు.

Related posts