telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రంగారెడ్డిలో దారుణం..పెళ్లైన మూడు నెలలకే కానిస్టేబుల్‌ సుసైడ్‌

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని యాచారం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు వివరాల్లోకి వెళితే… మల్లికార్జున సైదులు అనే కానిస్టేబుల్ యూనిఫామ్ లోనే ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదులు మర్రిగూడా పోలీస్ స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2020 బ్యాచ్ కు చెందిన సైదులు సివిల్ లో కానిస్టేబుల్ ఉద్యోగం పొందాడు. సైదులు కు గత మూడు నెలల క్రితం వివాహమైనట్లు తెలుస్తోంది. పెళ్లి అయిన మూడు నెలలకే సైదులు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కుటుంబ కలహాల వల్ల కానిస్టేబుల్ ఆత్మహత్య కు చేసుకున్నాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు యాచారం పోలీసులు. ఇంకా ఈ ఘటనలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts